logo

కమ్యూనిస్టు నాయకులతో ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి భేటీ*

తెలంగాణ స్టేట్:: ఖమ్మం జిల్లా ::(ఏప్రియల్ 28)

*ఖమ్మం:* సీ పీ ఐ, సీ పీ ఎం బలపర్చిన కాంగ్రెస్ లోక్ సభ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి ఆదివారం నగరంలోని సీ పీ ఎం జిల్లా కార్యాలయానికి వెళ్ళారు. ఈ సందర్భంగా అక్కడి నాయకులందరినీ కలిసి కరచలనాలు చేశారు. అనంతరం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర రావు, సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వర్లు, కల్యాణం వెoకటేశ్వ రావు తదితరులతో కలిసి సమావేశమయ్యారు. రఘురాం రెడ్డి మాట్లాడుతూ.. కమ్యూనిస్టుల సహకారం మరువలేనదని అన్నారు. తుమ్మల యుగేoధర్, కాంగ్రెస్ నగర కార్యదర్శి మహ్మద్ జావేద్ తదితరులు పాల్గొన్నారు.

7
1788 views